కొవిడ్ ​వేస్ట్‌ మేనేజ్​మెంట్​పై ఇయ్యాల సెమినార్

కొవిడ్ ​వేస్ట్‌ మేనేజ్​మెంట్​పై ఇయ్యాల సెమినార్

పద్మారావునగర్, వెలుగు: ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ హాస్పిటల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హాస్పిటల్​అడ్మినిస్ట్రేషన్‌ గాంధీ మెడికల్‌ కాలేజీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్​డాక్టర్‌ నరేందర్‌ కుమార్‌ తెలిపారు. ‘హెల్త్‌కేర్‌వేస్ట్‌ ఇంక్లూడింగ్‌ కొవిడ్‌-వేస్ట్‌ మేనేజ్‌మెంట్, యాంటిమైక్రోబయోల్‌ రెసిస్​టెన్స్‌అండ్‌ క్లైమేట్‌ రిసిలింట్‌ సిస్టం(హైబ్రీడ్‌ మోడ్‌)’ అనే అంశంపై సెమినార్​ఉంటుందని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. డీఎంఈ రమేశ్​రెడ్డి, తెలంగాణ వైద్య, విధాన పరిషత్​కమిషనర్‌ అజయ్‌కుమార్, గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఓ) సీనియర్‌ కన్సల్టెంట్‌ అలగ్జాండర్‌ వోన్‌ హెల్డిబ్రాండ్‌ హాజరవుతారని పేర్కొన్నారు.