నాగర్ కర్నూల్ లో రోడ్డు ప్రమాదం: ఏడుగురి మృతి

నాగర్ కర్నూల్ లో రోడ్డు ప్రమాదం: ఏడుగురి మృతి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌- శ్రీశైలం జాతీయ రహదారి ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్‌ దగ్గర రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్నవారిలో ఏడుగురు అక్కడి కక్కడే చనిపోయారు. గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం ధాటికి రెండు కార్లు నుజ్జునజ్జయ్యాయి. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు కార్లలో చిక్కున్న మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.