- ఆ కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
- ఇంటర్ బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా
బషీర్బాగ్, వెలుగు: ఇంటర్ ప్రాక్టికల్స్పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగిందని ఆరోపిస్తూ గురువారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నేతలు ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. ప్రముఖ కార్పొరేట్ కాలేజీల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందని, ఆ విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల నుంచి ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసి మరీ కాపీయింగ్కు పాల్పడ్డారన్నారు. సీసీ కెమెరాలను ఆఫ్ చేసి చిట్టీలతో పరీక్షలు రాయించారన్నారు. దీనిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇంటర్మీడియట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రదకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో మమత, అశోక్ రెడ్డి, కార్తీక్, లెనిన్, అవినాశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
