తెరుచుకున్న శబరిమల ఆలయం.. మణికంఠుని దర్శనం షురూ

తెరుచుకున్న శబరిమల ఆలయం.. మణికంఠుని దర్శనం షురూ

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని కేరళ సర్కార్ ఓపెన్ చేసింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 వరకూ 41 రోజుల (మండల కాలం) పాటు గుడి తెరిచే ఉంటుంది. డిసెంబర్ 27న మండల పూజలు నిర్వహించి రాత్రికి గుడిని మూసివేస్తారు.

తిరిగి మకర జ్యోతి పండుగ కోసం శబరిమల గుడిని డిసెంబర్ 30న తెరుస్తారు. ఆరోజు నుంచి అయ్యప్ప భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి (మకరవిళక్కు) రోజున మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తారు. జనవరి 20న ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం తలుపులు మూసివేస్తారు.