హత్రాస్ ఘటనపై సీఎం ఆదిత్యనాథ్‌‌ను టార్గెట్ చేసిన రాహుల్

హత్రాస్ ఘటనపై సీఎం ఆదిత్యనాథ్‌‌ను టార్గెట్ చేసిన రాహుల్

న్యూఢిల్లీ: హత్రాస్ గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ సర్కార్‌‌ను విమర్శిస్తూ ప్రతిపక్షాలు నిరనసలు తెలిపాయి. తాజాగా ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేశారు.

‘దళితులు, ముస్లింలు, గిరిజనులను చాలా మంది భారతీయులు మనుషులగా పరిగణించకపోవడం కాదనలేని సత్యం. సీఎం యోగితోపాటు రాష్ట్ర పోలీసులు ఎవరూ అత్యాచారం చేయబడలేదని అంటున్నారు. ఎందుకంటే వారితోపాటు అనేక మంది భారతీయులకు బాధితురాలు ఏమీ కాదు కాబట్టి’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌‌కు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థలో హత్రాస్ ఘటన గురించి వచ్చిన ఆర్టికల్‌‌ను జత చేశారు.