శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఓ విదేశీ ప్రయాణికురాలి నుంచి రూ. 14 కోట్ల 40 లక్షలు విలువ చేసే డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ నుంచి 2 కిలో హెరాయిన్ను సీజ్ చేసిన అధికారులు..ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
బురుండి దేశానికి చెందిన మహిళ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగింది. ఆమె భారీగా డ్రెస్సులు, హాండ్ బ్యాగ్,సోప్ కవర్స్లో డ్రగ్స్ తీసుకొచ్చింది. అయితే కదలికల్లో తేడా రావడంతో అనుమానం వచ్చి చెక్ చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ నుంచి రూ. 14.40 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.