ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గుడ్ న్యూస్..

 ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గుడ్ న్యూస్..

నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లైట్ జర్నీ సమయానికి కొన్ని నిమిషాల ముందు ప్రయాణికులంతా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడంతో బ్యాగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాసుల కోసం క్యూలైన్‌లో నిలబడాల్సిన  ఉంటుంది. ఈ క్రమంలో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతుండడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు కొత్త సేవలను తీసుకొచ్చారు. 

విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్, లగేజీ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు స్వస్తి పలుకుతూ సెల్ఫ్ చెకిన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా విమానాశ్రయంలోని కారు పార్కింగ్ ప్రాంతంలోనే ప్రయాణికులు సెల్ఫ్ చెక్ఇన్ చేసుకోవచ్చు. అక్కడే ప్రయాణికులు..  బోర్డింగ్ పాస్‌లు, లగేజీ పాస్‌లు పొందొచ్చు. 2024, జనవరి 1వ తేదీ సోమవారం నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఫైట్‌ జర్నీ సమయానికి 6 గంటల ముందు నుంచి ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు పొందొచ్చు.