ఎయిర్‌‌పోర్టులో జింక చర్మాల పట్టివేత

ఎయిర్‌‌పోర్టులో  జింక చర్మాల పట్టివేత

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ వ్యక్తి  నుంచి ఆదివారం రెండు కస్తూరి జింక చర్మాలను ఎయిర్‌‌పోర్టు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్‌‌ పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

ఇండిగో ఫ్లైట్ నంబర్ 6E -5245 విమానంలో ముంబయి వెళ్లడానికి సిద్ధమైన సయ్యద్ అక్బర్ పాషా హ్యాండ్ బ్యాగ్‌ని స్కానింగ్‌ చేయగా.. అందులో రెండు కస్తూరి జింక చర్మాలు ఉన్నట్లు  సీఐఎస్‌ఎఫ్‌ ఎస్ఐ సచిన్ గమనించారు. దీంతో అతడిని  అదుపులోకి తీసుకుని... జింక చర్మాలను స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నిందితుడిపై వన్య ప్రా ణుల చట్టం కింద కేసు నమోదు చేశారు.