ఎయిర్ పోర్టులో కిలోన్నర బంగారం సీజ్

ఎయిర్ పోర్టులో కిలోన్నర బంగారం సీజ్
  • ఫారిన్ కరెన్సీని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
  • నలుగురు ప్యాసింజర్లు అరెస్ట్

శంషాబాద్, వెలుగు :  బంగారం, ఫారిన్ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్న నలుగురు ప్యాసింజర్లను శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం దుబాయ్, కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ముగ్గురు వేర్వేరు ప్యాసింజర్లు బంగారాన్ని తరలిస్తున్న గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురి నుంచి 1,657 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

దీని విలువ సుమారు 99 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా బహ్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్యాసింజర్ ఫారిన్ కరెన్సీని తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రూ.13 లక్షల విలువైన ఫారిన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు నిందితులపై కస్టమ్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.