కేంద్ర పన్నుల వాటా.. తెలంగాణకు రూ.2,937 కోట్లు

కేంద్ర పన్నుల వాటా.. తెలంగాణకు రూ.2,937 కోట్లు
  •  ఏపీకి రూ.5,655.72 కోట్లు విడుదల 

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూ.2,937.58 కోట్లు, ఏపీకి రూ.5,655.72 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిధులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా కింద రూ.1,39,750.92 కోట్లను పంపిణీ చేసింది.

 అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు రూ.25,066.88 కోట్లు, బిహార్‌‌‌‌‌‌‌‌కు రూ.14,056.12 కోట్లు, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు రూ.10,970.44 కోట్లు, పశ్చిమ‌‌‌‌‌‌‌‌ బెంగాల్‌‌‌‌‌‌‌‌కు రూ.10,513.46 కోట్లు విడుదలయ్యాయి. 2024-–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.2,79,500 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.