
టాలీవుడ్లో టాలెంటెడ్ యాక్టర్స్ లలో శర్వానంద్(Sharwanand) ఒకరు. చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న ఈ యంగ్ హీరో సైలెంట్ గా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం శర్వా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మూవీలో హీరోగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (Peoplemediafactory) బ్యానర్ పై వివేక్, విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ శర్వానంద్ 35 ఫిల్మ్ గా రాబోతుంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా..షూటింగ్ చివరిదశకు వచ్చేసింది.
లేటెస్ట్గా శర్వా మరో మూవీని స్టార్ట్ చేసేశాడు. లూజర్ వెబ్ సీరీస్తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి(Abilashreddy) తో తన నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ నటిస్తుంది. అంతేకాదు..అపుడే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా మార్చి 1వ తేదీ లోపు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తోంది.
మరోవైపు, శర్వానంద్ మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్గా హీరో శ్రీవిష్ణు కు సామజవరగమన వంటి బ్యూటిఫుల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు(Ram Abbara)తో సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
మహా సముద్రం,ఆడవాళ్ళు మీకు జోహార్లు కమర్షియల్గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఒకే ఒక జీవితం సినిమా మాత్రం పర్వాలేదనిపించింది.అయితే, శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాల తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ను ఇప్పటి వరకు శర్వానంద్ అందుకోలేకపోయారు.ఇపుడు లేటెస్ట్గా రాబోయే మూవీస్ తో అయిన సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.