నామినేషన్ దాఖలు చేసిన శశిథరూర్ 

నామినేషన్ దాఖలు చేసిన శశిథరూర్ 

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయంలో అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన వెంట పార్టీ ఆఫీసుకు వచ్చారు. అంతకు ముందు శశిథరూర్ డప్పుచప్పుళ్లు, కార్యకర్తల డాన్సుల మధ్య ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. తిరువనంతపురం ఎంపీ అయిన శశిథరూర్ జీ 23 గ్రూపు నేతల్లో ఒకరిగా ఉన్నారు. అయితే తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జీ 23 గ్రూపులో తాను ఉన్నాననుకోవడం భ్రమ అని కామెంట్ చేశారు. 

మరోవైపు జార్ఖండ్ కాంగ్రెస్ నేత కేఎన్ త్రిపాఠీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్టుకు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ నాయకుల నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు.