పార్లమెంట్ మెట్లు దిగుతుండగా జారిపడ్డ శశిథరూర్

 పార్లమెంట్ మెట్లు దిగుతుండగా జారిపడ్డ శశిథరూర్

కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్ కాలికి గాయమైంది. పార్లమెంట్ మెట్లు దిగుతుండగా జారిపడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలు బెణికింది. నొప్పి తీవ్రమై ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. 

నడవలేని పరిస్థితిలో ఉన్నందున తన నియోజకవర్గ పరిధిలో ఉన్న పనులను రద్దు చేసుకున్నట్లుగా శశిథరూర్ ట్విట్టర్ లో వెల్లడించారు. కాలికి కట్టు కట్టిన ఫొటోలను ట్వీట్ చేశారు. థరూర్‌ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 7వ తేదీన ప్రారంభమయ్యాయి.