న్యూఢిల్లీ : ఆసియా గేమ్స్లో పాల్గొనే ఇండియా టీమ్లో తనకు చోటు దక్కకపోవడం చాలా షాక్కు గురి చేసిందని వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ అన్నాడు. అయితే సమీప భవిష్యత్లో మళ్లీ టీమిండియాలో చోటు సంపాదిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఎన్నో క్లిష్ట పరిస్థితులను దాటుకుని ఇక్కడి వచ్చా. కొన్నిసార్లు పరిస్థితులను ఆమోదించాలి.
రుతురాజ్ను కెప్టెన్ చేయడం సంతోషాన్నిచ్చింది. టీమ్లో అందరూ కుర్రాళ్లే ఉన్నారు. బాగా రాణిస్తారని ఆశిస్తున్నా’ అని ధవన్ పేర్కొన్నాడు. రోహిత్ తోడుగా శుభ్మన్ గిల్ ఓపెనర్గా రావడంతో డిసెంబర్ 2022లో ధవన్ను టీమ్ నుంచి తప్పించారు. అప్పట్నించి అతను వన్డే టీమ్లో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు.