శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఈడీ సమన్లు

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఈడీ సమన్లు

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సమన్లు జారీ చేశారు. గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చితో సంబంధాల క్రమంలో మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసే అవకాశం ఉంది. మనీలాండరింగ్ కేసులో రంజిత్ బింద్రాతో జరిపిన ఆర్థిక లావాదేవీలను ఈడీ తీవ్రంగా పరిగణిస్తుంది. రంజిత్ బింద్రాతో కొనసాగిన ఆర్థిక వ్యవహారాల్లో అనేక తేడాలు ఉన్నాయనే విషయం ఈడీ దృష్టికి వెళ్లడంతో… వాటి వివరాలు సేకరించేందుకు రాజ్ కుంద్రాకు సమన్లు జారీ చేసారు. ముంబైలో విలువైన ఆస్తుల అమ్మకాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు ED అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంలో ఇక్బాల్ మిర్చి పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత 2013లో గుండెపోటుతో మిర్చి చనిపోయాడు. ఇదే కేసులో గతంలో బింద్రాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ కుంద్రా ఖండించారు.