న్యూఢిల్లీ : దేశంలో రాజకీయాలు ఐపీఎల్ మ్యాచ్ల మాదిరిగా మారాయ ని, ఎవరు ఎవరి సైడ్ ఆడుతున్నారో తెలియట్లేదని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ‘‘దేశంలో మహారాష్ట్ర రాజకీయాలు తక్కువ స్థాయికి పడిపోయాయి. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారి బాధలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.
‘మీ ఇంటి వద్దకే ప్రభుత్వం’ వంటి కార్యక్రమాలు రాష్ట్రంలో అమల్లో ఉన్నాయి. కానీ, ప్రజల ఇండ్ల వద్ద పరిస్థితి ఏంటి? వారి గురించి ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. వారి కుటుంబాలను నాశనం చేస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు.