కృష్ణవంశీ సినిమాలో దొరసాని.?

కృష్ణవంశీ సినిమాలో దొరసాని.?

కమర్షియల్ హిట్టా కాదా అనే సంగతి పక్కన పెడితే.. చాలా విషయాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.‘దొరసాని’. ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శివాత్మికకైతే ఫుల్ మార్కులు పడ్డాయి. దొరసానిగా ఆమె లుక్స్, ఎక్స్‌‌ప్రెషన్స్,బాడీ లాంగ్వేజ్.. అన్నింటికీ మించి ఎమోషనల్‌‌ సీన్స్‌‌లో ఆమె నటన అందరినీ ఆకట్టుకున్నాయి. దాంతో ఆమెకి నటిగా మంచి భవిష్యత్తు ఉందని ప్రేక్షకులు తేల్చేశారు. ఆ టాలెంట్‌ వల్లే ఆమె ఓ సూపర్బ్ చాన్స్ కొట్టేసిందనే వార్త వినిపిస్తోంది. శివాత్మిక‘రంగమార్తాండ’లో ఓ కీలక పాత్రకి సెలెక్ట్ అయ్యిందట. మరాఠీ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్‌ గా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే ప్రకాష్‌ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం,అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి ఖరారయ్యింది. అమితాబ్ ఓ స్పెషల్‌‌ రోల్‌‌లో కనిపిస్తారని, అవికాగోర్‌ కూడా ఓ పాత్రలో నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇదినిజమో కాదో ఇంకా తెలియకుండానే ఇప్పుడు శివాత్మిక పేరు తెరపైకి వచ్చింది. ప్రకాష్‌ రాజ్ కూతురిగా చాలా ఇంపార్టెంట్‌ రోల్‌‌కి ఆమెని ఏరి కోరి ఎంచుకున్నారట. చాలా గ్యాప్ తర్వాత తీస్తున్నసినిమా కావడంతో దీనిపై కృష్ణవంశీ చాలా శ్రద్ధ పెట్టాడు. ఆయన కనుక ఫోకస్ చేస్తే సినిమా ఎలా ఉంటుందో తెలిసిందే. కాబట్టి చాన్స్ వచ్చిన సంగతి నిజమైతే కనుక శివాత్మిక కెరీర్‌ కి ఈ సినిమా ప్లస్ కావొచ్చు.