ప్రభుత్వానికి తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం కృతజ్ఞతలు

ప్రభుత్వానికి తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం కృతజ్ఞతలు

సికింద్రాబాద్ : దేవాలయాల్లో శివసత్తుల బోనాలకు ప్రత్యేక సమయం కేటాయించడం పట్ల తెలంగాణ శివసత్తుల సంక్షేం సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. శివసత్తుల కోసం మధ్యాహ్నం ఒంటిగంట నుండి 3 గంటల వరకు ప్రత్యేక సమయం కేటాయించినట్లు తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ శ్యామల దేవి చెప్పారు. ఈ సమయంలోనే శివసత్తులు బోనాలు తీసుకువచ్చి అమ్మవార్లకు సమర్పించాలని కోరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో తమ సమస్యకు పరిష్కారం లభించిందని చెప్పారామె. బోనాల పండుగకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అధికారులకు, రాష్ర్ట ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.