RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్‌లో టీంను మర్చిపోయిన అయ్యర్

RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్‌లో టీంను మర్చిపోయిన అయ్యర్

చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే టాస్ సమయంలో నవ్వు తెప్పించే సంఘటన ఒకటి జరిగింది. ఫాఫ్ డు ప్లెసిస్‌పై టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. తన జట్టు మొదట బౌలింగ్ చేస్తుందని చెప్పాడు. కారణం ఏంటని రవిశాస్త్రి అడిగిన తర్వాత ప్లేయింగ్ 11 లో ఏమైనా మార్పులు ఉంటాయా అని అడిగాడు. 

 ఈ మ్యాచ్ లో ఒక్క మార్పుతో బరిలోకి దిగుతామని చెప్పాడు. స్పిన్నర్ అంకుల్ రాయ్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నట్లు తెలిపాడు. అయితే అంకుల్ ఎవరి స్థానంలో ఆడతాడో అయ్యర్ చెప్పలేకపోయాడు. నేను కన్ఫ్యూజన్ లో ఉన్నానని.. నా చేతిలో రెండు జట్లు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తెలిసింది అంకుల్ రాయ్ నితీష్ రానా ప్లేస్ లో వచ్చాడని. మొత్తానికి కన్ఫ్యూజన్ లో అయ్యర్ గందరగోళానికి గురయ్యాడు. 

Also Read:బెంగళూరుతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

ఈ  మ్యాచ్ లో టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు ధాటిగా ఆడుతుంది. కోహ్లీ (53) హాఫ్ సెంచరీ చేయడంతో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. గ్రీన్ 3 పరుగులు చేసి రాణించాడు. కెప్టెన్ డుప్లెసిస్ 8 పరుగులు చేసి నిరాశ పరిచాడు.