ఆక్సియం 4 మిషన్ ప్రయోగం సక్సెస్..ISSలో శుభాన్ష్ శుక్లా వేటిపై పరిశోధనలు చేస్తారంటే..

ఆక్సియం 4 మిషన్ ప్రయోగం సక్సెస్..ISSలో శుభాన్ష్ శుక్లా వేటిపై పరిశోధనలు చేస్తారంటే..

అనేక వాయిదాల తర్వాత భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ఆక్సియమ్ మిషన్ 4 సిబ్బంది ప్రయాణిస్తున్న ఫాల్కన్ 9 రాకెట్ను బుధవారం(జూన్ 25) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా ప్రయోగించారు. 

నాసా, ఆక్సియమ్ స్పేస్ స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. జూన్ 26న సాయంత్రం 4:30 గంటలకు ISSతో డాకింగ్ జరగనుంది. ఈ మిషన్ ప్రయోగం అన్ని వ్యవస్థల్లో విజయం వంతం అయింది. వాతావరణ పరిస్థితులు లిఫ్టాఫ్ కు 90శాతం అనుకూలించాయని స్పేస్ ఎక్స్ ప్రకటించింది. 

NASA, ఆక్సియమ్ స్పేస్ ,స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా ఆక్సియమ్ మిషన్ 4ను తలపెట్టాయి. ISSకి వెళ్లినఆక్సియమ్ మిషన్ 4 నాల్గవ ప్రైవేట్ వ్యోమగామి మిషన్. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి ప్రయోగించిన కొత్త స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ఫాల్కన్ 9 రాకెట్ లో శుభాన్ష్ శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఐఎస్ ఎస్ కి ప్రయాణించారు. నాసా ప్రకారం.. ఈ అంతరిక్ష నౌక గురువారం (జూన్ 26) సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ISSతో డాక్ చేయనుంది.

నాసా మాజీ వ్యోమగామి ,ఆక్సియం స్పేస్ మానవ అంతరిక్ష ప్రయాణ డైరెక్టర్ పెగ్గీ విట్సన్ ఈ మిషన్‌కు నాయకత్వం వహించారు. ఇస్రోకు ప్రాతినిధ్యం వహిస్తున్న శుభాన్షు శుక్లా పైలట్‌గా ,యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)లో ప్రాజెక్ట్ వ్యోమగామి స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ ,హంగేరీ HUNOR ప్రోగ్రామ్ (హంగేరియన్ నుండి కక్ష్య) నుండి టిబోర్ కాపు ఇద్దరు మిషన్ నిపుణులుగా అంతరిక్ష కేంద్రంలో అనేక పరిశోధనలు జరిపేందుకు వెళ్లారు. 

ISS జ్వెజ్డా సర్వీస్ మాడ్యూల్ వెనుక భాగంలో ఉన్న ట్రాన్స్‌ఫర్ టన్నెల్‌లో మరమ్మతు పనులు,రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌తో సంప్రదించపుల తర్వాత ప్రయోగ విండోను ఖరారు చేసినట్లు నాసా తెలిపింది.నాసా ,రోస్కోస్మోస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సహకారంలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాయి. 

ఆక్సియమ్  మిషన్ భారతదేశం -యుఎస్ అంతరిక్ష సహకారంలో ఓ మైలురాయి. ఈ మిషన్ ద్వారా మొదటి ఇస్రో వ్యోమగామిని అంతరిక్ష కేంద్రానికి పంపించారు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ప్రధాని మోదీ ల నిబద్ధతకు నిదర్శనం అం టున్నారు ఇస్రోశాస్త్రవేత్తలు. 

ISS లో సిబ్బంది దాదాపు రెండు వారాల శాస్త్రీయ పరిశోధన చేయనున్నారు. విద్యా, వాణిజ్య కార్యకాలాపాలపై పరిశోధనలు చేయనున్నారు. ఈ మిషన్‌లో నాసా ,ఇస్రో మధ్య ఐదు సహకార సైన్స్ పరిశోధనలు ,రెండు ఇన్-ఆర్బిట్ STEM ప్రదర్శనలు కూడా ఉన్నాయి.