అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ 90 శాతం సక్సెస్ గా పనిచేస్తుందని ఆ సంస్థలు కొద్ది రోజుల కిందట ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఆ వ్యాక్సిన్ తో కొన్ని దుష్ప్రభావాలను గుర్తించినట్లు లేటెస్టుగా తేలింది. ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఒంటి నొప్పి, తలనొప్పి, తీవ్రమైన హ్యాంగోవర్గా అనిపించిందని వాలంటీర్లు చెప్పారు. ఈ విషయాన్ని తెలుపుతూ ది ఇండిపెండెంట్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా ఫైజర్ వ్యాక్సిన్ను ఆరు దేశాలకు చెందిన దాదాపు 43,000 మందికి దాన్ని వేశారు. వారిలో కొంతమందిలో అనారోగ్య సమస్యలు కనపడ్డాయని… తొలి డోస్లో సైడ్ఎఫెక్ట్స్ తక్కువగా ఉన్నాయని తెలిపింది. అయితే.. రెండో డోస్ తీసుకున్న తర్వాత ఈ లక్షణాలు అధికంగా కనపడ్డాయని ది ఇండిపెంట్ పత్రిక ప్రచురించింది.
వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాల తర్వాత వాలంటీర్లకు సంబంధించిన ఆరోగ్య అంశాలను 2 నెలల పాటు గమనించి, పూర్తి సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. ప్రతికూల ఫలితాలు వచ్చిన అంశంపై ఫైజర్ సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు.