డ్యూటీ చేస్తూ సింగరేణి కార్మికుడు మృతి

డ్యూటీ చేస్తూ సింగరేణి కార్మికుడు మృతి

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో డ్యూటీ చేస్తున్న సింగరేణి కార్మికుడు రక్తం కక్కుకుని చనిపోయాడు. రామగుండం రీజియన్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని ఆర్జీ3 ఏరియా ఓసీపీ2లో జనరల్‌‌‌‌‌‌‌‌ మజ్దూర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న చిందం తిరుపతి (54) రోజూలాగే సోమవారం విధులకు హాజరయ్యాడు. ఫస్ట్​షిఫ్ట్​లో పని చేస్తుండగా ఒక్కసారిగా నోటి, ముక్కు నుంచి రక్తం కక్కుకుంటూ కుప్పకూలాడు. తోటి కార్మికులు వెంటనే సింగరేణి ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అప్పటికే తిరుపతి మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా తిరుపతి కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.