ఇంకా ఐసీయూలోనే సింగర్ లతా మంగేష్కర్

ఇంకా ఐసీయూలోనే సింగర్ లతా మంగేష్కర్

కరోనాతో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నారు ప్రముఖ సింగర్ లతామంగేష్కర్. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆమెకు చికిత్స ఇస్తున్న డాక్టర్ ప్రతీత్ సంధాని.. బులెటిన్ విడుదల చేశారు. లతా మంగేష్కర్ ప్రస్తుతం ICU వార్డులోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 10 నుంచి 12 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంటుందన్నారు. కొవిడ్ తోపాట న్యుమోనియాతో బాధపడుతున్నట్లు తెలిపారు వైద్యులు.