దుబాయ్​లో గుండెపోటుతో పెద్దూర్ వాసి మృతి

దుబాయ్​లో గుండెపోటుతో పెద్దూర్ వాసి మృతి
డెడ్​బాడీని తెప్పించేందుకు మంత్రి కేటీఆర్ హామీ సిరిసిల్ల కలెక్టరేట్, ​వెలుగు: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరుకు చెందిన జెట్టి దేవయ్య శనివారం దుబాయ్ లో గుండెపోటుతో మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. మృతుడు బతుకుదెరువు కోసం 16 ఏండ్లుగా దుబాయ్ వెళ్తున్నాడని చెప్పారు. కాగా మృతదేహాన్ని సొంతూరుకు రప్పించటానికి తమకు స్థోమత లేదని అతని భార్య దేవవ్వ వేడుకున్నారు. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. మృతుడికి కొడుకు నాగార్జున, కూతురు రమ్యలత ఉన్నారు.