ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు

ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఆర్ పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న ఉదయం పదిన్నరకు కమాండ్ కంట్రోల్ లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని అధికారులు సూచించారు. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు.