ఆరు నూరైనా ప్రజా జీవితంలోనే ఉంటా : ఎమ్మెల్యే రాజయ్య

ఆరు నూరైనా ప్రజా జీవితంలోనే ఉంటా : ఎమ్మెల్యే రాజయ్య

జనగామ జిల్లాలో పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. టికెట్ రాని వాళ్లు బీఆర్ఎస్ పార్టీపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్టేషన్ ఘన్ పూర్ లో పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. BRS పార్టీ అభ్యర్థిగా MLC కడియం శ్రీహరిని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరు నూరైనా ప్రజా జీవితంలోనే తాను ఉంటానన్నారు. 

పంట పండించి, రాసి పోసిన తర్వాత ఎవరో వస్తా అంటే ఊరుకుంటానా..? అని మాట్లాడారు ఎమ్మెల్యే రాజయ్య. దేవుడున్నాడు... దేవుడి లాంటి కేసీఆర్ ఉన్నాడు.. రేపో, మాపో అనుకున్న కార్యక్రమం జరుగుతుందన్నారు. స్టేషన్ ఘన్ పూర్ ప్రజల కోసమే తాను ఉన్నానని, ప్రజల మధ్యలోనే చచ్చిపోతా అన్నారు. అయితే.. ఎమ్మెల్యే రాజయ్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.