ఆఫ్‌‌లైన్, ఆన్‌‌లైన్‌‌లో స్మార్ట్‌‌ఫోన్లు దొరకడం లేదు

ఆఫ్‌‌లైన్, ఆన్‌‌లైన్‌‌లో స్మార్ట్‌‌ఫోన్లు దొరకడం లేదు

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ కంపెనీలు కష్టాల్లో కూరుకుపోయాయి. గ్రేటర్ నోయిడాలోని ఒప్పో ఫ్యాక్టరీ మూత పడటంతో ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఛానల్స్ నుంచి వచ్చే డిమాండ్‌‌‌‌‌‌‌‌ను ఒప్పో, రియల్‌‌‌‌‌‌‌‌మీ, వన్‌‌‌‌‌‌‌‌ప్లస్‌‌‌‌‌‌‌‌లు అందుకోలేకపోతున్నాయి. రూ.15 వేల సబ్ కేటగిరీలో ఉన్న రియల్‌‌‌‌‌‌‌‌మీ, ఒప్పో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఛానల్స్‌‌‌‌‌‌‌‌లో దొరకడం లేదు. ప్రీమియం స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ బ్రాండ్ అయిన వన్‌‌‌‌‌‌‌‌ప్లస్ కూడా తన లేటెస్ట్ ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు వన్‌‌‌‌‌‌‌‌ప్లస్ 8, వన్‌‌‌‌‌‌‌‌ప్లస్ 8 ప్రొ ఓపెన్ సేల్‌‌‌‌‌‌‌‌ను వాయిదా వేసింది. ఒప్పో ఫ్యాక్టరీ మూత పడటంతో వన్‌‌‌‌‌‌‌‌ప్లస్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల తలెత్తిన పరిణామాలతో, మే ప్రారంభం నుంచి ప్రొడక్షన్ ఆగిపోయిందని, తమ సేల్స్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను మార్చేశామని వన్‌‌‌‌‌‌‌‌ప్లస్ అధికార ప్రతినిధి చెప్పారు. ఇండియాలో రియల్‌‌‌‌‌‌‌‌మీ, వన్‌‌‌‌‌‌‌‌ప్లస్ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లకు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఒప్పో ఉంది. తన ఫ్యాక్టరీలో కొంతమంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో, ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ను ఆపేసింది. ఇంకా ఫ్యాక్టరీ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కాలేదని ఒప్పో అధికార ప్రతినిధి చెప్పారు.

సప్లయికి ఆటంకాలు

సప్లయి చెయిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌‌‌‌‌‌‌‌ను అందుకోవడం సవాలుగా మారిందని రియల్‌‌‌‌‌‌‌‌మీ అధికార ప్రతినిధి కూడా చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ పార్టనర్లతో కలిసి పనిచేస్తూ రిటైల్ పాయింట్స్‌‌‌‌‌‌‌‌లో స్టాక్స్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులో ఉంచేలా చేస్తున్నామని తెలిపారు. ఎంట్రీ, మిడ్ రేంజ్ ఫోన్లకు భారీగా డిమాండ్ వస్తున్నట్టు మరో రిటైలర్ చెప్పారు. స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ మార్కెట్ అంతా రూ.12 వేల నుంచి రూ.15 వేల రేంజ్‌‌‌‌‌‌‌‌లోనే ఉందని, కానీ స్టాక్ అందుబాటులో లేదని ఆల్‌‌‌‌‌‌‌‌ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ అరవిందర్ ఖురానా చెప్పారు. ఒప్పో, రియల్‌‌‌‌‌‌‌‌మీ, శాంసంగ్, షియోమి అన్ని బ్రాండ్లలో ఈ ప్రాబ్లమ్ ఉందన్నారు. శాంసంగ్‌‌‌‌‌‌‌‌ ఎం సిరీస్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ వస్తున్నా.. స్టాక్స్ తక్కువగా ఉన్నట్టు చెప్పారు. రూ.15 వేలు, ఆపైన కేటగిరీ మొబైల్ ఫోన్ల సేల్స్‌‌‌‌‌‌‌‌కు ఫైనాన్సియల్ స్కీమ్‌‌‌‌‌‌‌‌లు కూడా లేవని పేర్కొన్నారు. ప్రభుత్వ సపోర్ట్ లేకపోవడంతో, 20 శాతం రిటైలర్లు షాపులను మూసేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.

కర్ణాటక బ్యాంక్ కు రూ.285 కోట్లు టొకరా