హౌరా ఎక్స్ ప్రెస్ లో పొగలు : వరంగల్ దగ్గర నిలిపివేత

హౌరా ఎక్స్ ప్రెస్ లో పొగలు : వరంగల్ దగ్గర నిలిపివేత

హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరా వెళుతున్న హౌరా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. 2023, సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 12 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గర రైలును నిలిపివేశారు డ్రైవర్లు. రైలులో పొగలు రావటాన్ని గమనించిన ప్రయాణికులు.. చెయిన్ లాగి రైలును ఆపారు. అప్పటికే పెద్ద ఎత్తున పొగలు.. బోగీలను కమ్మేశాయి. రైలు అయితే నెక్కొండ సమీపంలో.. రైల్వే స్టేషన్ల మధ్య నిర్మానుష్య ప్రాంతంలో ఆగిపోయింది. 

రైలులో పొగలు రావటాన్ని గమనించిన ప్రయాణికులు.. చెయిన్ లాగి రైలును ఆపేశారు. రైలు నుంచి దిగి పరుగులు తీశారు. భయాందోళనలకు గురైన ప్రయాణికులు.. రైల్లో నుంచి దిగి పరుగులు తీయటంతో గందరగోళం ఏర్పడింది. రైలులోని డ్రైవర్లు, గార్డు పరిస్థితిని సమీక్షించి.. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.

ALSO READ :ప్రయాణికులతో సహా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ
 

రైలు బ్రేక్ లైనర్లు పట్టేయటంతో పొగలు వచ్చాయని.. ఎలాంటి ప్రమాదం లేదని ప్రయాణికులు వివరించారు. బ్రేక్స్ సరి చేస్తే సరిపోతుందని వివరించారు.