పింక్‌బాల్ టెస్టులో తొలి సెంచరీ చేసిన స్మృతి మంధాన

పింక్‌బాల్ టెస్టులో తొలి సెంచరీ చేసిన స్మృతి మంధాన

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక పింక్‌బాల్ టెస్టులో భారత మహిళల జట్టు తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా భారత ఓపెనర్ స్మృతి మంధాన తనదైన శైలిలో షాట్లు కొడుతూ..బాల్ ను బౌండరీలకు పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలో ఆమె అరుదైన ఘనత సాధించింది. పింక్‌బాల్ టెస్టులో మొదటి సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.

అంతేకాదు తాను ఆడిన తొలి డే-నైట్ టెస్టులో సెంచరీ చేసిన రెండో భారతీయురాలిగా కూడా నిలిచింది. మంధాన ఇన్నింగ్సులో 19 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అసలు ఆమె తొలి రోజే సెంచరీ చేయాల్సింది. కానీ వర్షం అంతరాయం కలిగించడంతో మొదటి రోజు కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. దీంతో ఆమె సెంచరీ రెండో రోజుకు వాయిదా పడింది.