కూకట్పల్లి: రాత్రంతా మద్యం తాగి.. బిల్డింగ్ పైనుంచి పడి..సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి

కూకట్పల్లి: రాత్రంతా మద్యం తాగి.. బిల్డింగ్ పైనుంచి పడి..సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
  •     ప్రమాదవశాత్తు పడ్డాడా? ఆత్మహత్యా?

కూకట్​పల్లి, వెలుగు: బిల్డింగ్ పైనుంచి పడి ఓ సాఫ్ట్​వేర్​ఇంజినీర్​మృతిచెందాడు. ఈ ఘటన కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. ఏపీలోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కొత్తచిలుమూరుకు చెందిన పూల భానువర్ధన్​(27) సాఫ్ట్​వేర్​ఇంజినీర్. తన తమ్ముడు విష్ణువర్ధన్​తో కలిసి గాజులరామారంలో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి హైదర్​నగర్​లోని ఫ్రెండ్స్ రూమ్​కు వెళ్లాడు.

అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ అపార్ట్​మెంట్​పెంట్​హౌస్​లో మద్యం తాగారు. శనివారం ఉదయం 5 గంటలకు ఫ్రెండ్స్​నిద్రించగా.. భానువర్ధన్​ మాత్రం ఉదయం 7 గంటల వరకు కూడా మద్యం తాగుతూనే ఉన్నాడు. కాసేపటికే బిల్డింగ్​పైనుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు కింద పడ్డాడా లేక సూసైడ్​చేసుకున్నాడా, మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.