రాష్ట్రంలో గుండెపోట్లు కలవరపెడుతున్నాయి. ఉన్నచోటనే కుప్పకూలుతున్న ఘటనలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. మహేశ్వరంలోని స్టేడియంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మణికంఠ క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు.
కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో ఉంటున్న మణికంట వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి స్టేడియానికి వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగా ఒక ఓవర్ బౌలింగ్ చేసి కార్ లోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. మణికంఠ కారులో అలాగే తుది శ్వాస విడిచాడు. మణికంఠ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహేశ్వరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మణికంఠ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.