
బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలో డబుల్ ట్రాక్ పనులు కొనసాగుతోన్న దృష్ట్యా ఆ మార్గం లోవెళ్లే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని రైళ్లనురద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా మరికొన్నింటిని డైవర్షన్ చేస్తున్నట్లు, ట్రాక్ మెయిం టెనెన్స్ లో భాగంగాకొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రయాణికులు గమనిం చాలని సూచిం చారు. సికింద్రాబాద్– యశ్వం త్ పూర్ (గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలు) ఈ నెల 27 నుంచి ఏప్రిల్1, 4 వ తేదీల్లో రద్దు చేయబడుతుం ది. అదేవిధంగా ఈనెల 28 నుంచి ఏప్రిల్ 5 వ తేదీ వరకు యశ్వం త్ పూర్–గోరఖ్ పూర్ ఎక్స్ప్రెస్ రైలు, హజ్రత్ నిజాముద్దీ-న్ – యశ్వం త్ పూర్ కర్ణా టక సంపర్క్ క్రాంతిఎక్స్ప్రెస్ , డాక్టర్ అంబేద్కర్ నగర్– యశ్వం త్ పూర్ ఎక్స్ప్రెస్ రైలు, యశ్వం త్ పూర్– కోర్బావైన్ గంగా ఎక్స్ప్రెస్ రైలు, యశ్వం త్ పూర్–అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ రైలు , యశ్వం త్ పూర్–గోరఖ్ పూర్ ఎక్స్ప్రెస్ రైలు, లక్నో– యశ్వంత్పూ-ర్ ఎక్స్ప్రెస్ రైలు , మైసూరు– – జైపూర్ ఎక్స్ప్రెస్ రైలు, మైసూరు – శ్రీసాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ రైలు, కోయంబత్తూర్– హజ్రత్ నిజాముద్దీన్ –కొం గు ఎక్స్ప్రెస్ , ముం బై సీఎస్ఎంటీ – -నాగ-ర్కోయిల్ ఎక్స్ప్రెస్ , రాజ్ కోట్ – కోయంబత్తూర్ఎక్స్ప్రెస్ , ట్యూటికోరన్ – వివేక్ ఎక్స్ప్రెస్ రైళ్లతోపాటు తదితర రైళ్లను మళ్లిం చనున్నారు. అలాగే గుంటూ రు– కాచిగూడ డెమో రైలు పాక్షికంగా రద్దు చేస్తారు. ప్రయాణికులు గమనించి వివరాల కోసం దక్షిణ మధ్య రైల్వే వెబ్ సైట్లో గాని, అధికారులను గాని సంప్రదిం చాలని కోరారు.