అత్తమామలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు

అత్తమామలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు

కూకట్ పల్లి కేపీహెచ్ బీలో దారుణం జరిగింది. జేఎన్టీయూ సమీపంలో అర్థరాత్రి వృద్ధ దంపతులపై  గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.  నిందితుడు వాళ్ల అల్లుడు సాయికృష్ణగా గుర్తించారు. కూతురిని ప్రేమ వివాహం చేసుకొని వేధింపులకు గురిచేస్తున్న సాయికృష్ణపై గతంలో పోలీసులకు పిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు.