సోనియాగాంధీకి మళ్లీ అస్వస్థత

సోనియాగాంధీకి మళ్లీ అస్వస్థత

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ అరూప్ బసు ఆధ్వర్యంలో సోనియాగాంధీకి ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సోనియాను మధ్యాహ్నం 12 గంటలకు సర్ గంగా రామ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉండాలని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలోనూ సోనియాకు క్యాన్సర్ ట్రీట్ మెంట్ జరిగింది. అప్పటి నుంచి సోనియా అనారోగ్యంతో బాధపడుతున్నారు.