
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. రేపు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు సోనియా గాంధీ. ఈనెల 21న సోనియాను 2 గంటలపాటు విచారించిన అధికారులు.. రేపు మరోసారి ప్రశ్నించనున్నారు. నేషనల్ హెరాల్డ్ ముద్రించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు ఉన్న 90 కోట్ల రూపాయల అప్పును యంగ్ఇండియాకు బదలాయించడంపై ఈడీ ప్రశ్నలు సంధిస్తోంది. యంగ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్న సోనియాకు 38 శాతం వాటా ఎలా వచ్చిందన్నదానిపై కూపీ లాగుతున్నారు.
సోనియా గాంధీ రేపు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానుండటంతో నిరసనలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈడీ కార్యాలయాల ముందు బైఠాయించి నిరసన తెలపాలని నిర్ణయించింది. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం జరిగింది. రేపు చేపట్టాల్సిన ఆందోళనలపై చర్చించారు. ఇటు ఈడీ కార్యాలయాల దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.