నేను తప్పుకుంటా..సీడబ్ల్యూసీలో సోనియా

నేను తప్పుకుంటా..సీడబ్ల్యూసీలో సోనియా

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం(సీడబ్ల్యూసీ) వాడీవేడిగా జరుగుతోంది.. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పలువురు సీడబ్ల్యూసీ సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించాలంటూ  సోనియాగాంధీ సీడబ్ల్యూసీలో కోరారు. కొత్త అధ్యక్షుడని ఎన్నుకోవాలని అన్నారు. అయితే పార్టీ అధ్యక్యురాలిగా సోని గాంధీ కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు.

అయితే పలువురు పార్టీ నేతలు కాంగ్రెస్ మారాలంటూ 23 మంది నేతలు 15 రోజుల క్రితం సోనియా గాంధీకి రాసిన లేఖపై వాడివేడిగా చర్చ జరిగింది. పార్టీ నేతలు లేఖ రాయడంపై  రాహుల్  గాంధీ సీడబ్ల్యూసీలో ప్రస్తావించారు. సోనియాగాంధీ ఆస్పత్రిలో ఉన్న సమయంలో  లేఖ ఎలా రాశారని పార్టీ నేతలను ప్రశ్నించినట్లు సమాచారం.