రూ. 50 లక్షల విలువైన బంగారం స్వాధీనం

రూ. 50 లక్షల విలువైన బంగారం స్వాధీనం

రంగారెడ్డి జిల్లా  రాజేంద్రనగర్  పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బంగారం విక్రయిస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 50 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిట్ విసాపై దుబాయ్ వెళ్లిన ఓ కేటుగాడు..శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలించినట్లు ఎస్వోటీ పోలీసులు, శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్లో వెల్లడైంది. 

దుబాయ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలించిన బంగారాన్ని..సయ్యద్ మొయిజ్ పాషా, సమీర్ ఖాన్, మహ్మద్ అర్షద్ లు రంగారెడ్డి జిల్లా మైలార్ దేవులపల్లిలో విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు..నిందితుల నుంచి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై అక్రమ బంగారం రవాణా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.