IND vs SA: వరల్డ్ రికార్డ్ సృష్టిస్తారా.. డ్రా చేసుకుంటారా: గౌహతి టెస్టులో టీమిండియా టార్గెట్ 549

IND vs SA: వరల్డ్ రికార్డ్ సృష్టిస్తారా.. డ్రా చేసుకుంటారా: గౌహతి టెస్టులో టీమిండియా టార్గెట్ 549

గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ముందు సౌతాఫ్రికా కొండంత లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు సఫారీ బ్యాటర్లు తమ రెండో ఇన్నింగ్స్ లో కూడా నిలకడగా రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 549 పరుగుల టార్గెట్ ను ఇండియాకు నిర్ధేశించింది. నాలుగో రోజు స్టబ్స్ 94 పరుగుల ఔటై సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఇండియా విజయం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది. సౌతాఫ్రికా విజయానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇండియా నాలుగు సెషన్ ల పాటు ఆలౌట్ కాకుండా పోరాడితే మ్యాచ్ ను డ్రా గా ముగించవచ్చు. 

3 వికెట్ల నష్టానికి 107 పరుగులతో నాలుగో రోజు రెండో సెషన్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఈ సెషన్ లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 113 పరుగులు చేసింది. స్టబ్స్, టోనీ డి జోర్జీ రెండో టీ విరామం తర్వాత కూడా తమ నిలకడ చూపించారు. ఒక్కో పరుగు జోడిస్తూ జట్టు ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా ఆధిక్యం 450 పరుగులు దాటింది. నాలుగో వికెట్ కు 101 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు వీరి భాగస్వామ్యాన్ని జడేజా విడగొట్టాడు. 49 పరుగుల వద్ద జొర్జీని జడేజా ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత స్టబ్స్, ముల్లర్ మరో వికెట్ పడకుండా లంచ్ కు వెళ్లారు. అప్పటికే సౌతాఫ్రికా ఆధిక్యం 500 పరుగులు దాటింది. స్టబ్స్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు            

తొలి సెషన్ లో మూడు వికెట్లు:
 
వికెట్ నష్టపోకుండా 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి సెషన్ లో 81 పరుగులు రాబట్టింద. తొలి సెషన్ ఆరంభంలో సౌతాఫ్రికా ఓపెనర్లు మార్కరం, రికెల్ టన్ జాగ్రత్తగా ఆడారు. ఓపిగ్గా ఆడుతూ ఈ సిరీస్ లో మరోసారి జట్టుకు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 59 పరుగులు జోడించారు. ఎట్టకేలకు వీరి జోడీని జడేజా విడగొట్టాడు. జడేజా బౌలింగ్ లో సిరాజ్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కు రికెల్ టన్ ఔట్ కావడంతో సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. కాసేపటికే మార్కరం (29)తో పాటు కెప్టెన్ బవుమా (3) కూడా ఔట్ కావడంతో సౌతాఫ్రికా 77 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. 

మార్కరంను ఒక స్టన్నింగ్ డెలివరీతో జడేజా క్లీన్ బౌల్డ్ చేస్తే.. బవుమాను సుందర్ బోల్తా కొట్టించాడు. ఈ దశలో సౌతాఫ్రికా జట్టును ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జీ ముందుకు తీసుకెళ్లారు. టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంటూ టీ విరామం వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీసుకున్నాడు. సుందర్ కు ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 489 పరుగులు చేస్తే.. ఇండియా 201 పరుగులకు ఆలౌటైంది. దీంతో సఫారీలకు తొలి ఇన్నింగ్స్ లో 288 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది.