హైదరాబాద్ : హైదరాబాద్ జంట నగరాల మధ్య సేవలందించే పలు ఎంఎంటీఎస్ రైళ్లను నాలుగు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
సికింద్రాబాద్, సనత్నగర్ రైల్వేస్టేషన్లలో నిర్వహణ పనుల కారణంగా జూన్ 14 నుంచి 17వ తేదీ వరకు దాదాపు 22 ఎంఎంటీఎస్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు బుధవారం (జూన్ 14న) తెలిపారు.
జూన్ 14, 15వ తేదీల్లో లింగంపల్లి - హైదరాబాద్, హైదరాబాద్ - లింగంపల్లి మధ్య 10 రైళ్లు, జూన్ 14 నుంచి 17 తేదీల్లో ఉమ్దానగర్ - లింగంపల్లి, లింగపల్లి - ఫలక్ నుమా, రామచంద్రాపురం - ఫలక్ నుమా రూట్లలో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.