నేను పార్టీ మారట్లే .. ఆదిలాబాద్ నుంచే ఎంపీగా పోటీ చేస్తా : సోయం బాపురావు

నేను పార్టీ మారట్లే ..  ఆదిలాబాద్ నుంచే ఎంపీగా పోటీ చేస్తా : సోయం బాపురావు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, తాను పార్టీ మారట్లేదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేశారు. గురువారం కొంగరకలాన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మళ్లీ ఆదిలాబాద్ నుంచే బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని చూసి ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. 

భువనగిరి ఎంపీ టికెట్ నాదే: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

భువనగిరి నుంచే ఎంపీగా పోటీ చేస్తానని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. తనకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళానని మీడియాతో చెప్పారు. భువనగిరి టికెట్ కోసం పార్టీలో ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవచ్చని, అందులో తప్పేమీ లేదన్నారు.