V6 News

డిసెంబర్ 15న రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ

 డిసెంబర్  15న రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 15న రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కలిసి ఆవిష్కరించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ఎన్. అచ్యుత రామరాజు, కార్యదర్శి బి. ఎస్. కృష్ణమూర్తి శుక్రవారం తెలిపారు.

  సాయంత్రం 4 గంటలకు బాలు నివాళిగా సినీ సంగీత స్వర నీరాజనం ప్రారంభమవుతుందని, ప్రముఖ సినీ సంగీత దర్శకులు కీరవాణి, తమన్, సినీ నేపథ్య గాయకులు, బాలు కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ఎంట్రీ పాసుల కోసం 14న సాయంత్రం 3 గంటల నుంచి రవీంద్రభారతిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.