ఐటీ కారిడార్ మహిళలకు గుడ్​ న్యూస్.. ఆ రూట్​లో స్పెషల్​ బస్సు

ఐటీ కారిడార్ మహిళలకు గుడ్​ న్యూస్.. ఆ రూట్​లో స్పెషల్​ బస్సు

హైదరాబాద్​లోని ఐటీ కారిడార్​లో పని చేస్తున్న మహిళ ఉద్యోగులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ గుడ్​న్యూస్​ చెప్పారు.  టీఎస్‌ ఆర్టీసీ మహిళల కోసం సోమవారం నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల కోసం ‘మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లేడీస్‌ స్పెషల్‌’ బస్సు అందుబాటులోకి తీసుకువచ్చింది. 

జేఎన్‌టీయూ నుంచి వేవ్‌ రాక్‌ వరకు ఇది పైలట్​ ప్రాజెక్టుగా ఇది మొదట నడవనుంది. నగర ఐటీ కంపెనీల్లో దాదాపు 5 లక్షల మంది వుమెన్​ ఎంప్లాయ్స్ ఉన్నారు. ఫస్ట్​ బస్సు జేఎన్‌టీయూ నుంచి ఉదయం 9.05 గంటల నుంచి బయల్దేరి బస్సు నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ, గచ్చిబౌలి క్రాస్​ రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వెళ్తుంది. 

సాయంత్రం 5.50 గంటలకు వేవ్‌ రాక్‌ నుంచి ఆయా మార్గాల ద్వారా జేఎన్‌టీయూకు చేరుకుంటుంది. ప్రయోగాత్మకంగా నడుపుతున్న ఈ సర్వీసు విజయవంతమైతే మరిన్ని మార్గాల్లో నడిపించాలని రోడ్డు రవాణా సంస్థ భావిస్తోంది.  

ఈ బస్సుల్ని మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ఆయన ట్విటర్ లో షేర్​ చేశారు.