హైదరాబాద్, వెలుగు: కొండా లక్ష్మణ్ హార్టీకల్చర్ వర్సిటీ పరిధిలోని ఉద్యాన కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 17న ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ భగవాన్ తెలిపారు. 2025-=26 విద్యా సంవత్సరానికిగాను బైపీసీ విభాగంలో టీజీఈఏపీసెట్ -2025కు అర్హత సాధించి, అగ్రికల్చర్ వర్సిటీ నిర్వహించిన కంబైన్డ్ కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకుని ర్యాంకు పొందిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్కు హాజరు కావాలని పేర్కొన్నారు.
డిసెంబర్ 17న ఉదయం 10:30 గంటల నుంచి హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ సెంటర్లో జరుగనుంది. మరిన్ని వివరాల కోసం www.skltshu.ac.in, www.pjtau.edu.in వెబ్సైట్లను సందర్శించవచ్చు. లేదా మొబైల్ నంబర్ 96524 56779కు సంప్రదించవచ్చని రిజిస్ట్రార్ తెలిపారు.

