ఐపీఎల్ ట్రోఫీ గెలిచేది మేమే

ఐపీఎల్ ట్రోఫీ గెలిచేది మేమే

ముంబై: ఈసారి ఐపీఎల్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని ఆర్సీబీ సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. గత సీజన్ లో ప్లేఆఫ్స్ కు చేరుకున్నామనీ.. ఈసారి మాత్రం కప్పు సొంతం చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పాడు. గ్లెన్ మాక్స్ వెల్, క్రిస్టియన్, కైల్ జేమీసన్లాంటి ఆటగాళ్లతో జట్టు పటిష్టంగా ఉందన్నారు. ముఖ్యంగా మాక్స్ వెల్ విజృంభిస్తే తమకు తిరుగు ఉండదన్నాడు. 

'ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మాక్సీని తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే జరిగింది. అతడు జట్టులో చేరాడు. అతడి చేరికతో జట్టులో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఎందుకంటే మాక్సీ ఎలాంటి విధ్వంసం సృష్టించగలడో అందరికీ తెలుసు' అని కోహ్లీ పేర్కొన్నాడు.