కర్నాటక ఎమ్మెల్సీ ముందే ... కాంగ్రెస్​ లీడర్ల లొల్లి

కర్నాటక ఎమ్మెల్సీ ముందే ... కాంగ్రెస్​ లీడర్ల లొల్లి

భైంసా, వెలుగు : ఇటీవల బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరి డీసీసీ బాధ్యతలు స్వీకరించిన శ్రీహరిరావుకి ఎన్ఆర్ఐ, సీనియర్​ నేత విజయ్​కుమార్​ రెడ్డి మధ్య లొల్లి జరుగుతోంది. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య నువ్వా.. నేనా అన్న రీతిలో నడుస్తోంది. శ్రీహరిరావు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఎన్ఆర్ఐ విజయ్​కుమార్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా మంగళవారం భైంసాలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన  కర్నాటక ఎమ్మెల్సీ ప్రకాష్​రాథోడ్  ​ముందే ఇద్దరూ వాదులాడుకున్నారు.

ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. బీఆర్ఎస్​నుంచి కాంగ్రెస్​లో చేరిన శ్రీహరిరావు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని విజయ్​కుమార్​రెడ్డి కామెంట్స్​ చేశారు. మీటింగ్​ఉన్న సంగతి తనకు ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్​కు కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చివరకు ఎమ్మెల్సీ కలగజేసుకోని విజయ్​కుమార్​రెడ్డిని శాంతింపజేశారు. శ్రీహరిరావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని విజయ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు.