తెలుగుదనం ఉట్టిపడేలా ..

తెలుగుదనం ఉట్టిపడేలా ..

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు ఈ నెల 7న చెన్నైలో నిర్వహించనున్నారు. ఈ సంస్థ  స్థాపించి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా ఈసారి  ఘనంగా అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు.  కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ ‘జనవరి నుంచి డిసెంబర్ వరకు రిలీజైన తెలుగు సినిమాల్లో మన తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్న చిత్రాలకు పురస్కారాలు ఇస్తాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు అతిథిగా పాల్గొంటారు. సభాధ్యక్షుడిగా మండలి బుద్ధ ప్రసాద్ వ్యవహరిస్తారు’ అని చెప్పారు. అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్, కమిటీ మెంబర్స్ పర్వతనేని రాంబాబు, సౌజన్య, హేమంత్, నిర్మాత ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.