రెండో వన్డేలో భారత బౌలర్ల ధాటికి లంక విలవిల్లాడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక..ఓ దశలో ఒక వికెట్ నష్టానికి 102 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న లంకేయులను కుల్దీప్ యాదవ్ దెబ్బకొట్టాడు. కుషాల్ మెండీస్ను LBWగా ఔట్ చేశాడు. ఆ తర్వాత మరో పరుగు వ్యవధిలో శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. ధనంజయ డి సిల్వను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. 118 పరుగుల వద్ద ఫెర్నాండో రనౌట్ అయ్యాడు. మరికొద్ది సేపటి తర్వాత లంక కెప్టెన్ దసున్ శనకను కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు.
మరో పరుగు వ్యవధిలో కుల్దీప్ మరోసారి మాయ చేసి అసలంకను పెవీలియన్ చేర్చడంతో..శ్రీలంక 24 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక 152 పరుగుల వద్ద లంకను ఉమ్రాన్ మాలిక్ దెబ్బకొట్టాడు. హసరంగను ఔట్ చేయడంతో..లంక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది.