
టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్కు లంక దిగ్గజ క్రికెటర్ సంగక్కర కీలక సూచనలు చేశాడు. శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్కు ఎంపికైన సంజూ..ప్రశాంతంగా ఆడాలని సూచించాడు. సంజూ ఏ స్థానంలోనైనా ఆడగల ఆటగాడని కొనియాడాడు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొంటాడని చెప్పాడు. ఆ సత్తా, ట్యాలెంట్ సంజూ శాంసన్లో ఉన్నాయన్నాడు. అయితే లంకతో సిరీసే తనకు దక్కే చివరి అవకాశం అని సంజూ తొందర పడకూడదన్నాడు. లంకతో జరిగే సిరీస్లో సంజూ తన ఆటను ఎంజాయ్ చేయాలన్నాడు.
ఐపీఎల్లో ఆడినట్లు టీమిండియాలో ఆడితే కుదరదు..
ఐపీఎల్లో ఆడటం..టీమిండియాకు ఆడటం వేరని సంజూ గుర్తుంచుకోవాలని సంగక్కర సూచించాడు. అయితే బ్యాటింగ్పై దృష్టి పెట్టాలని..భారత్ కు ఆడే సమయంలో తన పాత్ర ఏమిటో తెలుసుకోవాలన్నాడు. క్రీజులోకి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలని..పాత్రకు న్యాయం చేయాలన్న విషయంపై క్లారిటీ ఉండాలన్నాడు. టీంలో చోటు దక్కించుకున్న సమయంలో ఏ స్థానంలో ఆడేందుకు అవకాశం వచ్చినా..అందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. ఆ నైపుణ్యం, సత్తా సంజూలో ఉన్నాయని నమ్ముతున్నట్లు సంగక్కర అభిప్రాయం వ్యక్తం చేశాడు.
లంక సిరీస్కు ఎంపిక..
సంజూ శాంసన్ చాలా రోజుల తర్వాత టీమిండియాకు ఎంపికయ్యాడు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్లో సంజూ శాంసన్కు చోటు దక్కింది. దీంతో అతని అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీమ్ లో చోటును పటిష్టం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇక సంజూ శాంసన్ టీమిండియా తరపున న్యూజిల్యాండ్ సిరీస్లో ఆడాడు. మూడు వన్డేల సిరీస్లో సంజూకు కేవలం ఒక్క వన్డేలో ఆడే అవకాశం మాత్రమే వచ్చింది. ఆ తర్వాత సిరీస్ అంత బెంచ్కే పరిమితమయ్యాడు.