
ఎల్బీనగర్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం, మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం గొప్ప పరిణామమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. వనస్థలిపురంలోని సాహెబ్నగర్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గురువారం మంత్రి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న జాతి కొరకే కాకుండా సబ్బండ వర్గాలకు పీడిత ప్రజల బాగుకు పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి, వేములయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.