శ్రీరాంపూర్ సింగరేణిలో కూలిన సైడ్ ఫాల్.. ముగ్గురి కార్మికులకు గాయాలు

శ్రీరాంపూర్ సింగరేణిలో కూలిన సైడ్ ఫాల్.. ముగ్గురి కార్మికులకు గాయాలు

మంచిర్యాల జిల్లా  శ్రీరాంపూర్ ఏరియాలోని SRP-3 గని లో ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ముగ్గురి కార్మికులకు గాయాలయ్యాయి.   భూగర్భ గని లో పనిచేస్తున్న సంపత్ కుమార్, మహేందర్,  రవికుమార్  అనే ముగ్గురిపై ఒక్కసారిగా సైడ్ ఫాల్  పడటంతో ప్రమాదం సంభవించింది.  గాయపడిన వారిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.